– సామ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన చేరిక
నవతెలంగాణ- వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్లోని కొండా బాలకష్ణ రెడ్డి ఫం క్షన్ హాల్లో మాజీ మంత్రి గడ్డం. ప్రసాద్ కుమార్ సమక్షంలో వివిధ పార్టీల నుండి నాయకులు కాం గ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే ఆనంద్పైన ప్రజల్లో చా లా వ్యతిరేకత ఏర్పడిందని నియంతలా వ్యవహారి స్తూ ప్రజల కోసం, వికారాబాద్ అభివద్ధి కోసం ఒక్కరూపాయి నిధులు తీసుకుని రాకుండా ఫొటో పోజులు తప్ప ఏమైనా అభివద్ధి జరిగిందా అని వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, సామ రాంచంద్రారెడ్డి అన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్గారి సమక్షంలో రాంచంద్రరెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు సామ ప్రభాకర్ రెడ్డి తో పాటు దాదాపు 300 మంది వారి అనుచరులు కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రస్తుత సిద్దులుర్ సర్పంచ్ ఆంజనేయులు వారి అనుచరులు దాదాపు 100 మంది, తొర్ మామిడి గ్రామ సీనియర్ నాయ కులు పంది. వెంకటయ్య 100 మంది వారి అను చరులతో జిన్నారం మాజీ సర్పంచ్ లింగయ్య 100 మంది వారి అనుచరులతో కాంగ్రెస్లో చేరి నారు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడు తూ.. ప్రతి కార్యకర్తనీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని తన నాయకత్వం పైన ప్రజలు ఉంచిన నమ్మకాన్ని ఓమ్ము చేయనన్నారు. బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమన్నారు. ఈ నెల 17న తుక్కుగూడలో సోనియా గాంధీ సభతో తెలం గాణలో కాంగ్రెస్ వేవ్ రాబోతుందని 5 గ్యారంటీలు అ సభలో మేడం సోనియా గాంధీ అనౌన్స్ చేస్తార న్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ డిక్లరేషన్లని తీసుకెళ్లి వారికీ కాంగ్రెస్ చేయబోయే మంచి కార్యక్రమలు వివరిస్తామని తెలిపారు. వికారాబాద్ నియోజకవ ర్గం నుండి దాదాపు 800 మంది నాయకులు, కార్య కర్త లు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, కిసాన్ నాయక్, రత్న రెడ్డి, జాఫర్, రఘుపతి రెడ్డి, నర్సిములు, కౌన్సిలర్ల ముర ళి, వేణుగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రెడ్యా నాయక్, మండల అధ్యక్షులు శంకర్, వెంకటేష్, రవీందర్, నర్సింగ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, సంతోష్, రహీం, జంగయ్య, దుద్యాల, లక్ష్మణ్, హాజీ, రాజేశేఖర్, అనంత య్య, రహీం, అశోక్, జిలాని, సత్యం, సిద్దార్థ్ రెడ్డి, మహేందర్, నరేందర్, విజరు కుమార్, రజినీ కాంత్, అబ్దుల్ రాజాక్, తదితరులు పాల్గొన్నారు.