నవతెలంగాణ – నాగార్జున సాగర్
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమల గిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తల 150 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని పార్టీ లోకి అహవ్వానించి కాంగ్రెస్ కండువాలు కప్పారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.