నవతెలంగాణ – ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ పరిధి హీరేలిలో పోలీసుల గుడరలపై రాకెట్ లాంఛర్లతో మావోయిస్టులు దాడి చేశారు. మావోయిస్టుల దాడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ తరుణలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కోద్దిసేపు ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పులు జరపడంతో మావోయిస్టులు పరారీ అయ్యారు. పోలీసుల గుడరలపై మావోయిస్టుల దాడిని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వర్షనేయ ధృవీకరించారు.