నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్సూచీలు సోమవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరకు నష్టాలతో ట్రేడింగ్ను ముగించాయి. దీంతో వరుసగా మూడోరోజూ నష్టాలు నమోదయ్యాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడుదొడుకుల మధ్య చలించాయి. ఫార్మా, స్థిరాస్తి రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తగా.. పీఎస్యూ బ్యాంక్స్, లోహ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. ఇదే ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడమూ సెంటిమెంట్ను దెబ్బతీసింది.