– ఘనంగా స్వాగతం పలికిన రెడ్డి రైతు యువజన సంఘం సభ్యులు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : అమ్మవారి దయ అందరిపై ఉండాలని మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి గ్రామంలో రెడ్డి రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 9 రోజులు విశేష పూజలు అందుకున్న అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. ఐతే మంగళవారం మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పెద్దగుండవెల్లిలో పలు మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీకి రెడ్డి రైతు యువజన సంఘం సభ్యులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. తదనంతం మెదక్ ఎంపీ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం దుబ్బాక నియోకవర్గప్రజలు బాగుండాలని , పాడి పంట సంవృద్ది పండాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపిన తన గెలుపుకు అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండేలా చూడాలని మొక్కుకున్నట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి రైతు యువజన సంఘం సభ్యులు సద్ది రాజిరెడ్డి, చిన్ని సంజీవ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నక్కల బుచ్చిరెడ్డి, రాఘవ రెడ్డి,మల్లారెడ్డి, పంజా సత్యం (పులి), యువత ఉన్నారు.