– డాక్టర్ రాందాస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని సున్నం బట్టి లో గల సున్నం బట్టి,పెద్దవాగు ప్రాజెక్ట్ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలురు వసతి గృహాల్లో శనివారం అశ్వారావుపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో వైద్యాధికారి రాందాస్ పర్యవేక్షణలో విద్యార్ధులకు వైద్యం శిబిరం నిర్వహించారు. రెండు పాఠ శాలలో లోని 49 మంది విద్యార్ధులను పరీక్షించి 9 మందిని జ్వర పీడుతులు గా గుర్తించారు.వీరికి రక్త నమూనాలు సేకరించి ఆర్.డి.టి పరీక్షించి సాధారణ జ్వరాలు గా గుర్తించి తరుణ వ్యాదుల గా నమోదు చేసి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి అజ్మీరా వెంకటేశ్వరరావు,హెచ్.ఎస్ శ్రీనివాస్,ఎ.ఎన్.ఎం భూ లక్ష్మి పాల్గొన్నారు.