– హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-చందానగర్
హాపీజ్పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 1 కాలనీలో ఎస్ఎల్జి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెగా వైద్య శిబిరాన్ని’ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ హపీజ్పేట్ పరిధిలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించిన ‘మెగా హెల్త్ క్యాంప్’ ఏర్పాటు చేసిన ఎస్ఎల్జీ ఆస్పత్రి యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరంలో 18 రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్, గైనకలజీ, ఆర్థో, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్స్రే, అర్హులైన వారికి కండ్లజోడులు, మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ విభాగం నుంచి డాక్టర్ సబీల, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అజరు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.