![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230930-WA0160-300x225.jpg)
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యాదవ సంఘం సభ్యులు శనివారం స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డినీ కలిసి సన్మానించినారు. కుల సంఘాలకు నిధులు మంజూరు చేస్తూ పట్టణ అభివృద్ధికి నిర్విరామ కృషి చేయడం అభినందనీయమని అన్నారు ..ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ యువజన నాయకులు మల్యాల నర్సారెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ కోన పత్రి కవిత కాశీరాం, యాదవ సంఘం సభ్యులు మహిపాల్, మాణిక్యం, బచ్చాయి, బాజన్న తదితరులు పాల్గొన్నారు.