‘మెర్క్యురియల్‌ రైజ్‌ ఆఫ్‌ తెలంగాణ’

–  టేబుల్‌ బుక్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫొటోలు, సమాచారంతో, సీిఎం కేసీఆర్‌ సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతత్వంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కాఫీ టేబుల్‌ బుక్‌ ‘మెర్క్యురియల్‌ రైజ్‌ ఆఫ్‌ తెలంగాణ’ను సీఎం కేసీఆర్‌ సచివాలయంలోని తన ఛాంబర్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు టి.హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్‌శర్మ, సీఎం ప్రధాన సలహాదారులు సోమేశ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌ అశోక్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు ముషరఫ్‌, హరిచందన తదితరులు ఉన్నారు. తొలి కాపీలను సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు సీఎస్‌ శాంతి కుమారి అందజేశారు.