హైదరాబాద్ : ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్టిసిసిఐ) నూతన ప్రెసిడెంట్గా మీలా జయదేవా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ప్రెసిడెంట్గా ఉన్న అనీల్ అగర్వాల్ నుంచి శనివారం జయదేవా నూతన బాధ్యతలను స్వీకరించారు. ఇంతక్రితం ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ హోదాలో కొత్తగా సురేష్ కుమార్ సింఘాలు ఎన్నికయ్యారు. మీలా జయదేవా సుధాకర్ ఇరిగేషన్ సిస్టమ్స్కు ఎండిగా, సుధాకర్ పివిసి ప్రొడక్ట్స్కు డైరెక్టర్గా ఉన్నారు. 15 ఏళ్లుగా ఆయన ఎఫ్టిసిసిఐలోని వివిధ నిపుణుల కమిటీలలో కీలకంగా వ్యవహారించారు. కొత్త బాధ్యతల్లో 2023, 2024లలో కొనసాగనున్నారు.