– సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రకుమార్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో అంగన్వా డీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐ టీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం అంగన్వాడీ వర్కర్ల తో కలిసి రాజేంద్రనగర్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఎమ్మార్వోకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా రుద్రకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంత్రులు ఇచ్చిన హామీలనూ నెరవేర్చకపోవడం దురదృష్టక రమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వా డీలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిం చాలని గతంలో అనేక నిరసనలు, ధర్నాలు నిర్వ హించినప్పుడు మంత్రి సత్యవతి రాథోడ్ ఆ సమ స్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్ప టివరకు నెరవేర్చకపోవడం బాధాకరమైన ఆయన అన్నారు. కేరళ పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మాదిరిగా అంగన్వాడీ టీచర్స్ అందరికీ రిటర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలి, పండుగ సెలవులు బోనస్, కనీస వేతనం అమలు చేయాలని, అంగన్వాడీ కేం ద్రాలుకు పక్కాగృహాలు నిర్మించాలని, అంగన్వాడీ టీచర్స్ అందరిని పర్మినెంట్ చేయాలని దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు, బలహీన వర్గాల పేద ప్రజల పిల్లలకు ఉచిత సేవలను అందిస్తూ వా రి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి అం గన్వాడీ టీచర్స్ ఆయాలు మినీ టీచర్లు అందర్నీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజేంద్రనగర్ మండలాధ్యక్షురాలు ఇందిరా, కార్యదర్శి సెమీము బే గం, నాయకులు ప్రియాంక, షమీం, వెంకటమ్మ, మ మత, షహీన్, సుజాత, సుధా అన్వర, జ్యోతి, రేణు క, శాంతి కుమారి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.