– కల్తీ కళ్ళే కారణమా..?
నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ధర్మారంభి గ్రామానికి చెందిన జామ పండ్ల సాయిలు నెల రోజుల క్రితం గల్ఫ్ దేశంలోని అబుదాబికి బతుకుతెరువు కోసం వెళ్ళాడు. వెళ్ళిన రెండు రోజులకే మతిసిమితం కోల్పోయి ఎక్కడ పడితే అక్కడ తిరగడం ప్రారంభించాడు. అతని స్నేహితులు అబుదాబిలోని ఖలీఫా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ పని చేస్తున్న అదే గ్రామానికి చెందిన మొగుళ్ల ఫైన్ భాను గుర్తించి గల్ఫ్ లోని కేవైసీ అధ్యక్షుడు రవికుమార్ సమాచారం అందజేశాడు. రవికుమార్ ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని చికిత్స అందించిన తర్వాత పూర్తిగా కోలుకున్నక ఇండియాకు పంపాలని కేవైసీ అధ్యక్షుడు రవికుమార్ కంపెనీ యజమానులతో మాట్లాడి శుక్రవారం గ్రామానికి పంపారు. అయితే సాయలు ఇండియాలో ఉన్న సమయంలో కల్తీకల్లు అధికంగా సేవించేవాడని దీని కారణంగానే మతిసిమితం కోల్పోయినట్లు సమాచారం.