![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230911-WA0100-135x300.jpg)
అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకాన్ని మండలంలోని పసర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే సీతక్క వీక్షించారు. సోమవారం ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. నాటకాన్ని వీక్షించిన అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ గారని, దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుక బడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా,వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారని అన్నారు. అదేవిధంగా దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని, భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం అని వారి జీవిత చరిత్రని ప్రజలందరూ చూసేలా, తెలుసుకునేలా నాటకాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఇరుగు పైడి మడిపల్లి శ్యామ్ కి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, కిసాన్ కాంగ్రెస్ జిల్ ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి, గ్రామ అధ్యక్షులు, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, గ్రామ ఉపాధ్యక్షులు పంగ శ్రీను, యనమద్దిని శ్రీను, ఎండి. బారి తదితర నాయకులు పాల్గొన్నారు.