నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సారంపల్లి రాజిరెడ్డి గారి తండ్రి ఉప్పల్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క మండల ఇన్చార్జి, మాజీ మండల అధ్యక్షులు జాలబు అనంతరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు పిఎసిఎస్ డైరెక్టర్ ఆషాడం మల్లన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు సిద్ధబోయిన శీను, నాయకులు పురుషోత్తం నరసింహులు, జగన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి సుధాకర్, నల్లముక్క రవి సోమయ్య, మిగతా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మృతుని కుటుంబాన్ని ఓదార్చి, పరామర్శించారు. మృతుని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆమె వెంట మాజీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, పి ఎ సి ఎస్ డైరెక్టర్, మండల బీసీ సెల్ మండల అధ్యక్షులు ఆషాడము మల్లన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు,తుడుందెబ్బ మండల కార్యదర్శి కొప్పుల జగన్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.