నవతెలంగాణ- న్యూఢిల్లీ : తెలంగాణలో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ (Assembly elections 2023) ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) నేడు ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా సీఈసీ(CEC) రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తున్నాం. 40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో పర్యటించాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నాం అని ఆయన తెలిపారు. పోలింగ్ శాతం పెంచుతాం అని, వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణలో 6 లక్షల ఓట్లు తొలగించినట్టు సీఈసీ(CEC) రాజీవ్ కుమార్ తెలిపారు. మద్యం
తెలంగాణ (Telangana)లో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో 230, రాజస్థాన్ (Rajasthan)లో 200, ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో 90, మిజోరం (Mizoram)లో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి.