– వెయ్యికోట్లకుపైగా ప్రాజెక్టుకు టెండర్లు
న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనం సమీపంలో ఎంపీల కోసం కార్యాలయాలు నిర్మించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా యోచిస్తోంది. ఎంపీల ఛాంబర్ల నిర్మాణం కోసం ప్రతిపాదించిన రూ.1,210 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం సంవత్సరం క్రితమే ప్రీ-క్వాలిఫికేషన్ బిడ్లను ఆహ్వానించింది. రాజధాని నడిబొడ్డున సెంట్రల్ విస్టా డెవలప్మెంట్, దానికి సంబంధించిన ఇతర ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఈ శాఖ ఇప్పుడు ఎంపీల ఛాంబర్ల ప్రాజెక్టును సమీక్షిస్తోంది. ట్రాన్స్పోర్ట్ భవన్, శ్రమశక్తి భవన్ ఉన్న చోటే ఎంపీలకు ఛాంబర్లను నిర్మించాలని తొలుత భావించారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు ఎంపీల కార్యాలయాల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించారు.