నవతెలంగాణ-మంగపేట
మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేస్తూ మండల ముస్లం సోదరులు శనివారం మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని జామే మజీద్ వద్ద ఉన్న పెద్ద చావిడి బస్టండ్ సెంటర్ లోని చిన్న చావిడి నుండి పీరీలను తీసి ముస్లం హిందూ సోదరులు ‘అస్సోయ్ దూల హారతి కాల్ల గజ్జల గమ్మతి’ అంటూ నృత్యాలు చేశారు. మండలంలోని కమలాపురం, చెరుపల్లి గ్రామాల నుండి సైతం ముస్లీం, హిందూ సోదరులు పీరీలను మండల కేంద్రానికి తీసుకొచ్చి నృత్యాలు చేశారు. ఈ సందర్బంగా మండలంలోని ప్రజలు తల్లి పీరి, చంద్రవంక, బగ్గలాలమ్ వంటి పీరీలకు ముడుపులు చెల్లించి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో ముజావర్ పుల్లూ, ముజావర్నీ మొరియంబీ, ఎండి.గౌస్, అఫ్రోజ్, అజ్మీర్, ఎస్కే.బురాన్, ముస్తాఫా, ముజీం, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.