నవతెలంగాణ -కంటేశ్వర్
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) నగర కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును మేనేజర్ కు అంధచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) నగర అధ్యక్షులు చంద్రసింహ, మోహన్, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు లక్ష్మణ్, సంతోష్ గౌడ్ లు మాట్లాడుతూ.. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 8 నుండి సమ్మె నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా అదేవిధంగా ఈనెల మూడవ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి నగరంలోని మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, మేడే కానుకగా కార్మికులందరికీ పెంచిన వెయ్యి రూపాయలు అందరికీ ఇవ్వాలని, ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం రెండవ పీ ఆర్సి లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ ఐ ఆర్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.