– రామ కృష్ణ వర్గం కొందరు
– ఉమక్క వర్గం మరి కొందరు
నవతెలంగాణ- చందుర్తి
కమల దళంలో రెండు వర్గాలుగా పని చేస్తున్నాయి. గతంలో రామ కృష్ణ వర్గం ఒకటే ఉండేది. ఐనప్పటికీ అప్పుడు కూడా కమల రెమ్మలు విడినట్లుగా నర్సింగాపూర్, ఎన్ గల్ గ్రామానికి చెందిన కార్యకర్తలు విడిపోయి బీజేపీలో రెండు వర్గాలుగా పని చేసిన విషయం తెల్సిందే. గత మూడు రోజుల కిందట అస్సాం ఎమ్మెల్యే రావడంతో ఉమక్క వర్గం కార్యకర్తలు అట్టి సమావేశానికి వేళ్ళ లేక పోయారు. బుధవారం వేములవాడలో ఎమ్మెల్యే రమేష్ బాబు ముట్టడికి తుల ఉమ తరలి వెళ్లగా అట్టి కార్య క్రమనికి రామ కృష్ణ వర్గం కార్యకర్తలు వెళ్ళాక పోవడంతో రెండు వర్గాలు గా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమ కు బీఆరెఎస్లో సముచిత స్థానం లేక పోవడంతో ఈటలతో భాజపాతో చేరింది దీంతో మండలంలోని ఆమె అభిమానులు చిలుక పెంటయ్య మరికొండరు ఆమెతో భాజపా లో చేరారు దింతో చందుర్తి మండలం లో రెండు కమల దళాలు గా పని చేస్తున్నాయి.
అంటి ముట్టనట్లుగా అల్లాడి
గత సెస్ ఎన్నికల్లో బీజేపీ తరుపున సెస్ ఎన్నికల బరిలో దిగాడు దింతో మండలంలోని కొంత పార్టీ బలం పెరిగింది. అని అనుకున్నారు. కానీ అల్లాడి రమేష్ సెస్ ఎన్నికల్లో ఓటమి చెందగా బీజేపీ పార్టీ లో ఆయన పని అంటి ముట్టనట్లుగా నే ఉంది.
మార్త సత్తయ్య…చిలుక పెంటయ్య కు కుదరని సయోధ్య
మార్త సత్తయ్య .ప్రతాప రామ కృష్ణ సమక్షంలో గతం నుండి బీజేపీలో పని చేస్తున్నాడు,దింతో ఆయన ఉమక్క వర్గం అంటే పెదవి విరుపుగానే ఉన్నాడు. మరో వైపుగా ఉమక్కతో పని చేస్తున్న చిలుక పెంటయ్య రామ కృష్ణ వర్గం అంటే పెద్దగా సుముఖత చూపక పోవడంతో కమల్ పార్టీ లో రెమ్మలు విడిపోతున్నట్లుగా తెలుస్తుంది.దింతో బీజేపీ టికెట్ వికాస రావు,తుల ఉమ ఆశిస్తున్నారు.ఎవరు ఏ వర్గంలో పని చేసిన పార్టీకి నష్టమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.మరో వైవుగా మండలంలో బీజేపీ నాయకులు ప్రజల తో సత్సంబంధాలు కూడా లేవని చర్చ జరుగుతుంది.