నవతెలంగాణ-హైదరాబాద్ : సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ చేశారు. దీంతో సినమాపై అంచనాలు పెరిగాయి. ఇక ప్రమోషన్స్ ను కూడా వేగం చేసింది. కొద్దిసేపటి క్రీతం ‘బ్రో’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ‘మై డియర్ మార్కండేయ’ అంటూ సాగే ఈ పాట మాస్ బిట్స్ తో తమన్ డ్రమ్స్ తో అదిరిపోయింది. ఇక ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. బ్రో చిత్రం జులై 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.