మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికుడు ఈర్ల జంపయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి జంపయ్య కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ జంపయ్య మృతి బాధాకరమని జంపయ్య కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తుమ్మల హరిబాబు, ఎంపీపీ సూది శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు సురపనేని సాయిబాబు, ఎంపీటీసీ ఆలూరు శ్రీనివాసరావు, కొఅప్షన్ సభ్యులు బాబర్, ఉప సర్పంచ్ అల్లంనేని హనుమంతరావు పార్టీ నాయకులు బొల్లం శివ, తుమ్మల శివ, మునిగల వెంకన్న, ఫక్రుద్దీన్, జన్ను కర్ణాకర్, కనకయ్య, మల్లేష్ గౌడ్, రాములు, కుమార్, అనిల్, సమ్మయ్య,మునిగల కరుణాకర్, మద్దినేని సాంబయ్య, మిట్ట సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.