![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG_20230809_143211.jpg)
నవతెలంగాణ-గోవిందరావుపేట
వరద ప్రాంతాలను పరిశీలించడంలోనూ పరిహారం చెల్లించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడారు. జులై 26న కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లాలో మూడు మండలాలు 16 గ్రామాలలో భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు రాష్ట్రంలో 17 మంది ఈ వరదల్లో మరణించారని అయినా నామమాత్రంగా మంత్రులు పర్యటించినారని ఈరోజుకు ములుగు జిల్లా నష్టం అంచనాలు వేయలేదని పేర్కొన్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర బృందం జులై 31న ములుగు జిల్లాలో పర్యటించిందని నష్టం వివరాలు తెలుసుకున్నా మనీ పేర్కొన్నారు జిల్లాలో 2150 కుటుంబాలు వరదల్లో దెబ్బతిన్నారని 500 పైగా పూర్తిగా నష్టపోయి పోయారని పేర్కొన్నారు 3000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని భూములు సాగుకు యోగ్యం కాకుండా 300 ఎకరాలు పోయినాయి అని పేర్కొన్నారు సిపిఎం పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి కి వరద బాధితుల నష్టం గురించి ముఖ్యమంత్రి కి వివరించి బాధితులు ఆదుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విరాళాలు సేకరించి ములుగు ప్రాంతంలో దెబ్బతిన్న కుటుంబాలను సిపిఎం పార్టీ ఈ రోజున సహాయం చేసిందని ఒక్కొక్కరికి 850 రూపాయల సరుకులు ఇచ్చామని జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల రూపాయలు విలువచేసే సరుకులు అందజేస్తున్నామని ప్రాజెక్టు నగర్ లో మరణించిన మృతుల కుటుంబానికి 20వేల రూపాయలు సహాయం అందించామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వరద బాధితులు ఆదుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట్రంలో దెబ్బతిన్న ఈ రెండు జిల్లాలు ములుగు భూపాలపల్లి కలెక్టర్ తో సమావేశం నిర్వహించి నష్టమంచనాను తెలుసుకొని వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వాలని పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు .రైతుల దెబ్బతిన్న భూములకు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చేశారు వేలాది మోటర్లు కొట్టుకుపోయాయని వారందరికీ మోటర్లు అందించాలని విద్యుత్తు పూర్తిగా దెబ్బతిని గోవిందరావుపేట నుండి కొండ వరకు ఈ సంవత్సరం రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆ రైతులందరూ కూడా ఆదుకోవాలని తక్షణమే విద్యుత్ సౌకర్యం కల్పించాలని కొట్టకపోయిన మోటార్లను ప్రభుత్వ అందించాలని డిమాండ్ చేశారు .ఈ భారీ వర్షాలకు లక్నవరం చెరువుకు ప్రధాన కాలువైన నరసింహులు కాలువ శ్రీరామ్ పతి కాలులకు భారీగాండ్లు పడి రైతులు నారు ఎండి పోయి వేసిన నాట్లు ఎండిపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వెంటనే కాలువలు గండ్లను పూడ్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకు డు చూడి కృష్ణారెడ్డి ,జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, బి రెడ్డి సాంబశివ ,జిల్లా కార్యవర్గ సభ్యుడు జిల్లా కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి ,పొదిళ్ల చిట్టిబాబు ,గొంది రాజేష్ మండల నాయకులు అంబాల మురళి అంబాల పోషాలు, ముమ్మిడి ఉపేంద్ర చారి, ఖ్యాతం సూర్యనారాయణ ,కొట్టెం కృష్ణారావు, రమేష్ ,జిల్లా మహిళా సంఘం నాయకురాలు కారం రజిత, మంచాల కవిత, జిమ్మజ్యోతి తదితరులు పాల్గొన్నారు.