![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230709-WA0847-300x200.jpg)
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని కాల్వపల్లి, దండుపల్లి గుత్తి కోయ ఆదివాసీ గిరిజనులకు నేతాజీ సర్వీస్ టీం వారు నిత్యావసర సరుకులు, గుత్తి కోయ బడి ఈడు పిల్లలకు ఆదివారం బలపాలు, నోట్ బుక్స్, స్పోర్ట్స్ సామాగ్రి, పెన్నులు అందించారు.ఈ సందర్భంగా నేతాజీ సర్వీస్ టీం అధ్యక్షులు మోగసాని శంకర్, బరుపటి అనిల్ కుమార్ లు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో రకాలుగా పథకాలను అందిస్తుంది, మీ పిల్లలను ఉన్నత చదువులు చదువుకోవడానికి హాస్టళ్లను అందుబాటులో ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చదువును మధ్యలో ఆపేయకుండా ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని, బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సర్వీస్ టీమ్ సభ్యులు చెల్పూరి హరీష్, భీమ్ చిల్డ్రెన్ హ్యాపీనెస్ సెంటర్ బాధ్యులు వీరెల్లి శశింధర్ రెడ్డి, నల్లమొక్క రణధీర్ తదితరులు పాల్గొన్నారు.