– తెలంగాణలో అభివృద్ధిలో రెండవ స్థానం నిజామాబాద్
– ప్రతి డివిజన్ లో డ్రైనేజీ ల నిర్మాణం
– పచ్చదనం విరజిల్లెల పార్కుల నిర్మాణం
– నగరం లో 40 వేయిల మందికి ఆసరా పింఛన్లు.l
– అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరం లో పలు అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. రూ. 1 కోటితో డివిజన్ నం.6 లో నూతనంగా నిర్మిచే రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు వినాయక్ నగర్ హనుమాన్ మందిరం వెనకాల భూమిపూజ చేశారు.@.. రూ.1 కోటి తో డివిజన్ నం.23 లో నూతనంగా నిర్మించే రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు వినాయక్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షాప్ వెనకాల భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో అభివృద్ధి సంక్షేమం లో దేశం లో మొదటి స్థానం లో ఉంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల్లో నిజామాబాద్ నగరం సుందరీకరణంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో నిజామాబాద్ నగరం రెండవ స్థానంలో ఉంది.నిజామాబాద్ నగరం లో ప్రతి గల్లీలో రోడ్లు డ్రైనేజి లు నిర్మించాము.ప్రధాన రోడ్లను విస్తరించి విశాలంగా నిర్మించాము.ఎల్లమ్మ గుట్ట రైల్వే కమాన్ వద్ద ఆర్ యు బి నిర్మించి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చాము. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లోని ఐటి హబ్, మినీ ట్యాంక్ బండ్, తదితర అభివృద్ధి పనులను చేసుకోవడం జరిగింది నగరంలో ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. నిజామాబాద్ నగరం లో అభివృద్ధి పనులు అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు తడ్కల్ ఉమా రాణి శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు సిర్ప రాజు, కార్పొరేటర్ ధర్మపురి, బి ఆర్ ఎస్ నాయకులు పంచారెడ్డి సూరి, ఎనగందుల మురళి, పాల్తీ రవికుమార్, కులాచారి సంతోష్, మధు రెడ్డి, మాకు రవి గంగారెడ్డి, రాజేష్, శివ లింగం, వెంకటేష్, పాక సురేష్, ఎర్రం గంగాధర్, పుప్పాల భాజన్న కొండ వీరశేఖర్, మరియు స్థానికులు పాల్గొన్నారు.