నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల సమ్మె నోటీసును మండల విద్యా వనరుల అధికారి కార్యాలయంలో ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ పాపయ్య, కంప్యూటర్ ఆపరేటర్ వైద్య సంపత్ కు అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ జిల్లా కమిటీ అధ్యక్షులు కిష్టా గౌడ్ మాట్లాడుతూ గత 5/6 నెలల నుండి పెండింగ్లో ఉన్న బిల్లులు, పెంచిన గౌరవేతనాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అందజేస్తున్న కోడిగుడ్డు ప్రభుత్వమే అందజేయాలని, కొత్త మెనూ ప్రకారం పిల్లలకు స్లాబ్ రేట్ పెంచాలని, వంట పాత్రలు, మౌలిక వసతులు కల్పించాలని, అక్రమ తొలగింపులు అరికట్టాలని, కాటన్ యూనిఫాం, సామాజిక భద్రత, ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని తెలిపారు. అంతకుముందు ఎంఈఓ కార్యాలయంలో కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటేశం, సత్తయ్య, రామస్వామి, భూలక్ష్మి, వనజ తదితరులు పాల్గొన్నారు.