నవతెలంగాణ – రాయదుర్గం: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఆర్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు నెలల క్రితమే ఆస్ట్రేలియా నుంచి వచ్చి మై హోం భుజా డీ బ్లాక్ 1401 ప్లాట్లో విష్ణువర్ధన్రెడ్డి(46) నివాసం ఉంటున్నారు. విష్ణువర్ధన్రెడ్డి స్వస్థలం గంటురు జిల్లా. తన ఫ్లాట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని విష్ణువర్ధన్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, వివాహం కాకపోవడంతో విష్ణువర్ధన్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.