![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/06/IMG-20230605-WA0128-300x165.jpg)
– పోలిస్ స్టేషన్ ముందు దళిత సంఘాల ఆందోళన..
నవతెలంగాణ డిచ్ పల్లి : భారత రాజ్యాంగ నిర్మాతడాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దళితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ డి గ్రామానికి చెందిన మోతే భూమేశ్వర్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం గల్ఫ్ లో ఉపాధి కొరకు వెళ్లి బెహరీన్ లో కార్మికుడిగా పని చేస్తున్నాడు.మోతే భూమేశ్వర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను వ్యంగ్యంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు వారు వివరించారు. ఈ వీడియో వైరల్ కావడంతో దళిత సంఘాలు కలిసి ఈ వ్యాఖ్యలను తివ్రంగా ఖండించారు.సోషల్ మీడియాలో పెట్టిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసన తెలుపుతూ జై భీమ్ జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్, రాంపూర్, డిచ్ పల్లి, మెంట్రాజ్ పల్లి, ధర్మారం బి తోపాటు అయా గ్రామాలకు చెందిన దళితులు, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, మాల మహానాడు సంఘం సభ్యులందరూ కలిసి డిచ్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ కు దళిత సంఘాలన్నీ కలిసి రాంపూర్ డి కు చెందిన మోతే భూమేశ్వర్ అనే వ్యక్తిని బెహరిన్ నుండి ఇండియా రప్పించాలని కోరుతూ అతనిపై రాజ్యాంగపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో వ్యంగంగా మాట్లాడాడని బెహరిన్ ఎంబసీ లో అంబేద్కర్ సంఘాల వ్యక్తులు కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఇలా ఎందుకు మాట్లాడాలని అనిపించిందని దీని వెనుక ఎవరో కుట్ర పడ్డారని నీ వెనుక ముందు ఎవరు నడిపిస్తున్నారని దళిత సంఘాలు సోమవారం రోజు బెహరిన్ లో రాంపూర్ మోతే భూమేశ్వర్ నివసిస్తున్న ఫ్లాట్ కి వెళ్లి క్షమాపణ చెప్పాలని నిలదీయాగా తాను ఎవరికి క్షమాపణ చెప్పనని ముందుగా మాట్లాడారని బెహరాన్ లో ఉన్న అంబేద్కర్ సంఘాల సభ్యులు తెలిపారు. బాబా సాహెబ్ రాజ్యాంగ నిర్మాత పై ఇలాంటి చర్యలకు పాల్పడితే దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల సభ్యులు అంతా కలిసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖబర్దార్ అగ్రవర్ణాల వారు ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు.
భారత రాజ్యాంగం రచించిన బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తిని వెంటనే భారతదేశం తీసుకువచ్చి అరెస్టు చేసి చర్యలు చేపట్టి శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ, మాల మహా నాడు నాయకులు, మైనార్టీ నాయకులు మద్దతుగా పోలీస్ స్టేషన్కు తరలివచ్చి ఫిర్యాదు చేశారు.