– జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కే లలిత కుమారి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
మహిళా శిశు వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమ లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నా మ ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికా రిణి కేతావత్ లలితా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. పోషణ మాసం సెప్టెంబర్ మొదటివారం నుంచి నెలాఖరు వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మాతా, శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆరోగ్యం పైనా ప్రత్యేక దృష్టి సారించి గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిశీల నకు ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమం ద్వారా మాసోత్సవాలు నిర్వహిస్తు న్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో (కొడం గల్, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్) 1107 అంగన్వాడీ కేంద్రా లున్నాయని మొత్తం 5 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణులు:7007, బాలిం లు:3896, జీరో టు 3 ఏండ్ల పిల్లలు:34586, 3 నుండి 6 ఏండ్ల పిల్లల సం ఖ్య : 21596 లబ్ది పొందుతున్నారని తెలి పారు. తల్లీబిడ్డ సం పూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం జరు గుతుందని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవ మయ్యే వరకు ఆరోగ్యం పట్ల మహిళా, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారని ప్రతి తల్లి పౌష్టి కా హారం తీసుకుంటేనే పుట్టే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వివరిం చారు. ఆహారం ఎక్కువ పరి మాణంలో తీసుకోవాలి అని ఇనుము, మాంసకృ త్తులు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, చిక్కుళ్లు, బెల్లం, ధాన్యాలు, ఖర్జూర, పం డ్లు అదేవిధంగా ప్రాంతీయంగా దొరికే తాజా పండ్లు తీసుకుంటే ఎక్కువగా తీసుకోవాలని పాలు, పెరుగు, గుడ్లు ఆహారంలో భాగంగానే వాడాలని సూచించారు. అయోడైజ్డ్ ఉప్పును సరైన మోతాదులో వాడాలని పండ్ల రసా లు, నీళ్లను ఎక్కువగా తాగాలని కొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆమె వివరించారు.