రెంజల్ మండలంలో శుక్రవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా ఫ్రైడే & డ్రై డే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై ప్రజాప్రతినిధులు, అధికారులు, అవగాహన కల్పించారు. మండలంలోని కందకుర్తి, దూపల్లి, నీలా గ్రామాలలో సర్పంచ్ మీర్జా కలీం బేగ్, దూపల్లి సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత లో చురుకుగా పాల్గొన్న పారిశుధ్య కార్మికులకు సన్మానించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు వంట పాత్రలు పరిశుభ్రంగా ఉంచాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు నవీన్, సిహెచ్ సాయి, ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్, ఆరోగ్య కార్యకర్తలు జానకి, రాణి, సరోజ, శోభ, ఆశలు రేఖ, నాజియా బేగం ,శ్యామల ,సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.