![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230808-WA0588.jpg)
నవ తెలంగాణ – సిద్దిపేట
రాష్ట్రంలో 2023-25కు ప్రభుత్వం మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించిందని, ఒకరు ఎన్నైనా దరఖాస్తులు వేయవచ్చని, మద్యం షాపులు దక్కించుకోవచ్చు అని మెదక్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాదారు. ఈనెల 4 నుంచి 18 సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలకు అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క ఆప్లికేషన్ కు రూ.2 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మద్యం దుకాణాలలో గౌడకులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం దుకాణాలకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో 93 దుకాణాలకు గానూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ , గౌడ కులస్తులకు 16 డ్రా ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. 2003-25 మద్యం పాలసీలో టర్నోవర్ లిమిట్ 10 రేట్లకు పంచడం జరిగిందని, గతంలో7 రేట్లు ఉండేదన్నారు. టర్నోవర్ లిమిట్ లిఫ్టింగ్ జరిగాక విధించే ప్రివిలేజ్ ఫీ 13.6 నుండి 10 శాతం కి తగ్గించడం జరిగిందని, ఒక్కరూ ఎన్నైనా మద్యం దుకాణాలు డ్రా ద్వారా పొందవచ్చుని, నెల లోపు 25 వేలు చెల్లించి షాప్ ని సులభంగా షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. డ్రా కోసం ఇతర వ్యక్తులు హాజరయ్యేలా ఆథరైజ్ చేసే అవకాశం ఉందని, ఈ ఎండి ఇవ్వవలసిన అవసరం లేదని, 6 సులభతర వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంటుందని, గతం లో 4 వాయిదాలు ఉండేవని తెలిపారు. పారదర్శకంగా కలెక్టర్ సమక్షం లో డ్రా తీయడం జరుగుతుందని తెలిపారూ. ఈ సమావేశంలో డిపిఈఓ శ్రీనివాసమూర్తి, ఇన్స్పెక్టర్ లు బ్రహ్మనందరెడ్డి, ఏ.శ్రీనివాస్, మహేంద్రకుమార్ , గాయత్రి, పవన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.