– ముఖ్య కార్యకర్తల సమావేశంలో బోయినిపల్లి వినోద్ కుమార్
– బెజ్జంకి బీఆర్ఎస్ ప్రణాళికను రాష్ట్ర వ్యాప్త అమలుకు ప్రతిపాధన
– ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువేళ్లాలని సూచన
– రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంలో కార్యకర్తలదే ప్రధాన భూమిక
– పార్టీ పటిష్టతకు కార్యకర్తలే పునాది-ఎమ్మెల్యే రసమయి
నవతెలంగాణ-బెజ్జంకి
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి..తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి..రాష్ట్ర ప్రజల అదరణతో అంచెలంచెలుగా ఎదిగి అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇతర పార్టీలకు దీటుగా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వంద రోజులు..వందోట్ల బెజ్జంకి బీఆర్ఎస్ ప్రణాళికను రాష్ట్ర వ్యాప్త అమలు చేసే ప్రతిపాధకు ప్రత్యేక చోరవ చూపుతామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు,మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ తెలిపారు.మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డ్ అవరణంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి అద్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తో కలిసి హజరై పార్టీ శ్రేణులకు దిశానిర్థేశం చేశారు.దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు గడపగడపకు తీసుకువేళ్లాలని సూచించారు.రానున్న ఎన్నికల్లో పార్టీ శ్రేణులే ప్రధాన భూమిక పోషించాలని..తద్వార బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలవోకగా మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.మిగులు బడ్జెట్ గా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ప్రత్యర్థి పార్టీలు గగ్గోలు పెడుతాయని..విద్యుత్ తయారీ,ప్రాజెక్టుల నిర్మాణం,మిషన్ భగీరథ వాటికే ప్రభుత్వం అప్పులు చేసిందని..దేశంలో అప్పులు కడుతున్న రాష్ట్రం ఏకైక తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు.ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ పార్టీ పటీష్టతకు కార్యకర్తలే పూనాదని,ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతగా పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేల నిరంతరం కృషి చేయాలని..అందరికి ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ప్రజా సేవే పరమావధిగా శాయశక్తుల పని చేస్తానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే స్ట్రాటజీ లేదని..అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే శక్తి లేదని..మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రసమయి బాలకిషనే దాదాపుగా ఖారారవుతారని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లాధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు తెలిపారు.గత తొమ్మిదేళ్లుగా నియోజకవర్గంతో పాటు మండలాభివృద్ధికి నిరంతరం చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుందని..రాబోయే ఎన్నికల్లో రసమయి బాలకిషన్ ను మరోసారి ఎమ్మెల్యేగా భారీ అధిక్యంతో ఎన్నిక చేసుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు.రాళ్లు ఎన్ని ఉన్న శిల్పి చెక్కిన రాయినే ప్రజలు దేవుడంటారని..పార్టీ శ్రేణులు చెక్కిన శిల్పమే ఎమ్మెల్యే రసమయి బాలకిషనేనని..అయన మండలాభివృద్ధికి చేసిన కృషి,రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కీలకపాత్ర పోషించారని మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేల శాయశక్తుల కష్టపడాలని చేరికల కమిటీ చైర్మన్ చింతకింది శ్రీనివాస్ గుప్తా తెలిపారు.అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయగా పాలకవర్గ సభ్యులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కనగండ్ల కవిత,బీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు,ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాల జెడ్పీటీసీలు సిద్ధం వేణు,రవీందర్ రెడ్డి,ఎఎంసీ చైర్మన్ చంద్రకళ, సర్పంచులు మంజుల,లక్ష్మి, అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, మండలంలోని అయా గ్రామాల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
అడ్డుకునే యత్నాన్ని ఛేదించిన పోలీసులు..
-నిరసన వ్యక్తం చేసిన సీపీఐ నాయకుల అరెస్ట్
గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటనను అడ్డుకునేందుకు సీపీఐ నాయకుల యత్నాన్ని పోలీసులు ఛేదించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా చేపట్టిన నిరసనలో గతంలో ఇచ్చిన పాలిటెక్నిక్ కళాశాల,వంద పడకల ఆస్పత్రి,మండల కేంద్రంలో గురుకుల పాఠశాల పక్క భవనాల నిర్మాణం,ఆర్హులైన వారందరికి దళిత బందు,బీసీ సహయం పారదర్శకంగా అందజేయాలని డిమాండ్ చేశారు.అనంతరం సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.అరెస్టయిన వారిలో సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేశ్,ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు సంగెం మధు,రొడ్డ చరణ్,దొంతరవేణీ మహేశ్ తదితరులున్నారు.
బీఆర్ఎస్ నాయకుల దాడి హేయమైన చర్య..
గత నెలరోజులుగా తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపట్టిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బీఎస్పీ నాయకులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వినతిపత్రమందజేతకు యత్నించగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్యని బీఎస్పీ నాయకులు ఖండించారు. పంచాయితీ కార్మికుల సమస్యల వినతిపత్రమందజేతపై నిర్లక్య్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.