![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/1690456449243.jpg)
మండలంలోని జాతీయ రహదారి 161 పై డివైడర్ ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం నాడు చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161 పెద్ద కొడపగల్ బ్రిడ్జి పై ఉన్న డివైడర్ను నాందేడ్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఇన్నోవా క్రిష్ట MH 26BD6699 నంబరు గల వాహనం అదుపుతప్పి ఢీకొంది .అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ అబ్దుల్ అఫ్రోజ్ తండ్రి అబ్దుల్ ఖదీర్ (26) గాయలు కాగా, సైక్ ముత్తోగి తండ్రి అజ్మీరుద్దీన్ (24) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ కోనారెడ్డి తెలిపారు.గాయాలైన సైక్ ముత్తోగి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై కోనా రెడ్డి పేర్కొన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు. కారులో ఇరుకపోయిన వ్యక్తిని బయటకు తీయడానికి జాతీయ రహదారి సిబ్బంది రోడ్డు భద్రతాధికారి సురబ్ ప్రతాప్ వారి బృందందాదాపుగంటన్నర పాటు కష్టపడి మృతదేహాన్ని బయటకు తీశారు.
![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/1690456449248.jpg)
![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/1690456449248.jpg)