నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొన్ని నెలలుగా చిన్న పిల్లలపై కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలోని ఎల్బీనగర్, ఇస్లాం పురా ప్రాంతాల్లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది పాపపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారి మొహంపై కుక్క కరవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. పాపతో పాటు పలువురిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయాలపాలైయ్యారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.