నవతెలంగాణ – మెక్సికో
మెక్సికోలో ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యభగవానుడు ప్రతాపం చూపిస్తుండటంతో దేశంలోని చాలాచోట్ల రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగాలలు వీస్తుండటంతో ఇప్పటివరకు 100 మందికిపైగా చనిపోయారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. వారిలో జూన్ 18 నుంచి 24తో ముగిసిన వారంలోనే అత్యధికులు మృత్యువాతపడ్డారని వెల్లడించింది. అంతా హీట్ స్ట్రోక్తోనే చనిపోయారని తెలిపింది. గతేడాది ఇదే సమయంలో ఎండల వల్ల ఒక్కరు మాత్రమే మరణించారని చెప్పింది. కాగా, గత మూడువారాలుగా నమోదవుతున్న ఎండలతో విద్యుత్కు రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగిందని, దీంతో ఎనర్జీ గ్రిడ్ దెబ్బతిన్నదని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో సర్వీసులను నిలిపివేశామని చెప్పింది. సరోనా రాష్ట్రంలోని అకోంచీ పట్టణంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని అధఙకారులు వెల్లడించారు.