– తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామ శ్రీనివాస్ పిలుపు
నవతెలంగాణ- కంటేశ్వర్
రాజ్యాధికార సాధన కోసం పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగాలి అని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆగష్టు 13న చేపట్టనున్న చలో కోరుట్ల పద్మశాలీల యుద్దభేరి కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను బుదవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో ఉన్న జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామ శ్రీనివాస్ ముఖ్యాతిధిగా హాజరై ప్రసంగించారు. ఓట్ల పండగ రాగానే పద్మశాలీలందరూ బేధాభిప్రాయాలు మర్చిపోయి రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా ముందుకు సాగి యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని సూచించారు. ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇవ్వకున్నా బాధపడవద్దని ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవడం ద్వారా పద్మశాలీల సత్తా చాటాలన్నారు. ఆగస్టు 13న నిర్వహించనున్న చలో కోరుట్ల కార్యక్రమానికి పెద్దయెత్తున పద్మశాలీలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.చలో కోరుట్ల కార్యక్రమ కన్వీనర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య,సంఘం రాష్ట్ర నాయకులు బూర మల్లేషం, నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు దీకొండ యాదగిరి,ప్రధాన కార్యదర్శి పులగం హనుమాండ్లు, ఉపాద్యక్షులు బిజ్జు దత్తాద్రి, నిజామాబాదు నగర అధ్యక్షుడు గుజ్జేటి వెంకట్ నర్సయ్య,పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు రాపెల్లి గురుచరణ్, సంఘం ప్రతినిధులు డాక్టర్ సత్యనారాయణ,గుడ్ల భూమేశ్వర్,బల్ల లక్ష్మిభాయి, చంద్రభాగ, బెజుగం నర్సింలు, చౌటి భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.