![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/06/IMG-20230619-WA0041-300x230.jpg)
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ చేయాలని హుస్నాబాద్ ఏసిపి సతీష్ అన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి సతీష్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ ఎర్రల కిరణ్, ఎస్ఐ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు.