నవతెలంగాణ – కాకినాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నామని ఆలయ ఈవో ఆజాద్ శుక్రవారం చేపారు. కొండపై మంచినీరు తదితరాలకు ప్లాస్టిక్ సీసాలు, ప్యాకెట్లు, గ్లాసులు విక్రయాలు, వినియోగం నిషేధించామన్నారు. పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న ఈ చర్యలకు భక్తులంతా సహకరించాలని కోరారు.