నవతెలంగాణ – మణిపూర్: రాహుల్ ను అడ్డుకోవడానికి గల కారణాలను పోలీసు అధికారులు వెల్లడించారు. రాహుల్ వెలుతున్న దారిలో గ్రనేడ్ దాడి జరిగే ప్రమాదం ఉందనే అనుమానంతో పోలిసులు కాన్వాయ్ ని అడ్డుకున్నామని ప్రకటించారు. హెలికాప్టర్ లో వెళ్లాలని సూచించాం. రాహుల్ భద్రతను దృష్టిలో ఉంచుకొని తాము రహదారి మార్గంలో అనుమచించలేద’ని బిష్ణుపూర్ కు చెందిన పోలీస్ అధికారి తెలిపారు. ఈ తరుణంలో ఇంపాల్ చేరుకున్న రాహుల్ ఆ తర్వాత హెలికాప్టర్ లో వెళ్లి, సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారితో మాట్లాడారు. అయితే రాహుల్ ను పోలీసులు అడ్డుకోవడంపై మణిపూర్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లమీదకు వచ్చారని, కానీ సీఎం ఆదేశాల మేరకు పోలీసులు రోడ్లను దిగ్బంధించారని తమకు తెలిసిందని, రాహుల్ పర్యటనను రాజకీయం చేస్తున్నారని మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ మేఘచంద్ర మండిపడ్డారు.