![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/Ramagiri-1-2.jpg)
నవతెలంగాణ-రామగిరి :
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళాబృందం సభ్యులు రామగిరి ఎస్సై కటికే రవి ప్రసాద్ ఆద్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట ఎక్స్ రోడ్ లో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజలకు తెలియజేసే విధంగా పాటల ద్వార, మాటల ద్వార వివరించారు. అదేవిధంగా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని, మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, భద్రత యాప్ లు, సైబర్ క్రైమ్, డయల్ 1930, డయల్ 100 ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం సభ్యులు నాతరి శ్రీనివాస్, ఇనుముల సమ్మయ్య, దాసరి సదానందం, దంతెనపల్లి సంపత్, జెరుపులు రవిందర్, దేవ సత్యనారాయణ, దాసరి అమర్ నాథ్, కట్ల భద్రయ్య, ఏఎస్సై వినోద్ కుమార్ పాల్గొన్నారు.