నవతెలంగాణ – న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ వాహన ధరల్ని మరోమారు పెంచుతున్నది. జూలై 3 నుంచి మోటర్సైకిళ్లు, స్కూటర్ల ధరలు దాదాపు 1.5 శాతం మేర పెరుగుతాయని శుక్రవారం ఈ దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ప్రకటించింది. మార్కెట్లు, మోడళ్లనుబట్టి ధరల్లో మార్పులుంటాయి. పెరిగిన ఉత్పాదక వ్యయంతో పడుతున్న భారం, ఇతరత్రా కారణాల దృష్ట్యా ధరల్ని పెంచక తప్పట్లేదని ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది.