మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద ప్రీ స్కూల్ లో శనివారం ప్రొఫెషనల్ డే కార్యక్రమం నిర్వహించారు. ప్రీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు ఏ రంగంలో రాణించాలి అనుకుంటున్నారో ఆ వేషదారణలో డాక్టరుగా, ఇంజనీరు, లాయర్ ,టీచర్, పోలిస్ , ఆర్మీ సోల్జర్స్ ,బ్యాంక్ మేనేజర్ వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గూర్చి నలంద యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో తమకంటూ ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. ఆ లక్ష్యం కోసం బాల్యం నుండే ఆ దిశగా అడుగులు వేస్తూ వుండేలా చేయడం. ఆయా వృత్తుల గొప్పతనం గూర్చి విద్యార్థులకు తెలియజేయడం, ఇపుడు వారు నిర్ణయించుకున్న ప్రొఫెషన్ ను చేరుకోవాలంటే ఎలా కష్టపడాలి. ఏ ఏ మార్గాలు అనుసరించాలి. అనే విషయాల పట్ల అవగాహనం కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమున్ని నిర్వహించామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు వారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు ఆ లక్ష్యాన్ని మరవకుండా వాళ్ళ లక్ష్య సాధన కోసం కష్టపడతారు. అని -ఉపాధ్యాయని లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ప్రసాద్ , సాగర్ ప్రీ స్కూల్ టీచర్స్ అరుంధతి, శ్రావణి, అర్షియా ఫాతిమా విద్యార్థిని , విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.