
ట్రాఫిక్ సిబ్బందికి జేమ్స్ రోటరీ క్లబ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వడదెబ్బ తగలకుండా నివారణ నిమిత్తం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హోమియోపతి మెడిసిన్స్ ను అడిషనల్ డీసీపీ అడ్మిన్ చేతుల మీదుగా ట్రాఫిక్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కోటేశ్వర రావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు, ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ వెంకట నారాయణ, రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ దేవిదాస్, జాయింట్ సెక్రెటరీ చంద్రశేఖర్, హోమియోపతి డాక్టర్ గోపికృష్ణ ట్రాఫిక్ సిబ్బంది హాజరు కావడం జరిగింది.