20న విద్యాదినోత్సవం నుంచే ‘రాగిజావ’

– 25.26 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం
– మన ఊరు-మనబడి కింద వెయ్యి పాఠశాలల ప్రారంభం
– 20 వేల టీచర్లకు ట్యాబ్‌ల అందజేత
– 1,600 స్కూళ్లలో 4,800 డిజిటల్‌ తరగతులు : విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈనెల 20న తెలంగాణ విద్యా దినోత్సవం నుంచే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావను అందించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతి రోజూ ప్రార్థనా సమయానికి ముందు విద్యార్థులకు 250 మిల్లీ లీటర్ల రాగి జావను అందిస్తామని తెలిపారు. దీని వల్ల 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి వివరించారు. గురువారం హైదరాబాద్‌ లోని తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. ఈనెల 20న విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమం కింద సకల వసతులతో ఆధుని కీకరించిన వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను మంత్రులు, శాసన సభ్యులు ప్రారంభిస్తారని పేర్కొ న్నారు. రాష్ట్రంలోని ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 16,27, 457 మంది విద్యార్థులకు మూడేసి చొప్పున వర్క్‌బుక్స్‌, ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 12,39, 415 మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒక్కో నోటు పుస్తకం చొప్పున అందించ నున్నట్టు వివరించారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెంపొందించేందు కు, సమాచార బదలా యింపు కోసం రాష్ట్రంలోని 20 వేల మంది ఉపాధ్యా యులకు ట్యాబ్‌లను అందిస్తామని తెలి పారు. రాష్ట్రంలోని 1,600 పాఠశాలల్లో నిర్మితమైన 4,800 డిజిటల్‌ తరగతు లను విద్యా దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు సభలు, సమావేశాలను నిర్వహిం చాలని సూచించారు. విద్యా రంగంలో సాధించిన విజయాలను వివరించాలని కోరారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 10 వేల గ్రంథాలయాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రూ.190 కోట్లు వ్యయం చేసి 30 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నామని వివరించారు. వాటిని ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశా లల్లో చదువుతున్న 26 లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచ్చించి ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫారాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్య దర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవ సేన తదితరులు పాల్గొన్నారు.