నవతెలంగాణ – అమరావతి: చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రేపటి నుంచి సెలవులో వెళ్తున్నారు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవులోకి ఉండనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఇంచార్జ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇలాంటి వేళ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పరిశీలించారు.