నవతెలంగాణ – హైదరాబాద్
టీఎస్ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ రైతు బంధు చైర్మన్గా తాటి కొండ రాజయ్యను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా రాష్ట్ర ఎంబీసీ చైర్మన్గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉప్పల వెంకటేశ్ నియమితులయ్యారు. వీరి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.