![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230914-WA0391-300x225.jpg)
నవతెలంగాణ-సిద్దిపేట : జిల్లాలోని రేషన్ కార్డ్ దారులు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని జిల్లా పౌరసరపారుల శాఖ అధికారి తనూజ సూచించారు. గురువారం పట్టణంలోని శ్రీనగర్ కాలనీ షాప్ నంబర్ 3803046 ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలలో ఈపాస్ మిషన్ ఉండడంవల్ల ఈ కేవైసీ చేస్తున్నారని తెలిపారు.
ముందుగా రేషన్ తీసుకెళ్లేందుకు వచ్చిన కార్డు ద్వారా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. తదుపరి సమయంలో కార్డ్ దారులు కుటుంబ సభ్యులను ఈ కేవైసీ చేయాలని రేషన్ డీలర్లకు సూచించారు. అన్ని రేషన్ దుకాణంలో ఈ కేవైసీ చేస్తున్నారని, కార్డుదారులు సద్విని చేసుకోవాలన్నారు. ఆమె వెంట సిద్దిపేట ఈపాస్ డిసి అనిల్ కుమార్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.