నవతెలంగాణ – ఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా భారీ సంఖ్యలో కరెన్స్ మోడల్ కార్లను రీకాల్ చేస్తోంది. సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం 30,297 కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు తెలిపింది. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఫిబ్రవరి మధ్య తయారైన యూనిట్లను రీకాల్ చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రీకాల్లో భాగంగా క్లస్టర్ బూటింగ్ ప్రక్రియలో ఏదైనా సమస్య ఉంటే ఉచితంగానే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇస్తామని కియా తెలిపింది. లేదంటే క్లస్టర్ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని తెలిపింది. రీకాల్ ప్రక్రియలో భాగంగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూస్తామని, వినియోగదారులకూ వ్యక్తిగతంగానూ సమాచారం అందిస్తామని తెలిపింది. షెడ్యూల్ అపాయింట్మెంట్స్ కోసం అథరైజ్డ్ డీలర్లను వినియోగదారులు సంప్రదించాల్సి ఉంటుందని పేర్కొంది.కక