నవ తెలంగాణ-భువనగిరి రూరల్
భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ (మదర్ డైరీ) ఎన్నికలు జరిపించాలని కోరుతూ డిసిఒ ఆ గ్రామ పాల సంఘం రైతులు వినతిపత్రం అందజేశారు. బస్వాపురం గ్రామంలో ప్రస్తుతం ఉన్న చైర్మన్ కాలపరిమితి జూన్ 22వ తేదీతో ముగిసిందని, జూన్ 22వ తేదీన జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా డైరెక్టర్ పదవి కాలం కోల్పోయి ఇద్దరు స్థానంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. పదిమంది డైరెక్టర్లు ప్రస్తుతం చైర్మన్ కి ఉన్న కస్తూరి పాండుకు నలుగురు మద్దతుండగా, రాసాల దేవేందర్ కు ఆరుగురు డైరెక్టర్ల మద్దతు ఉందని, చైర్మన్ ఉన్న వ్యక్తి ఓడిపోతారని ఎన్నిక జరపడం లేదని ఆరోపించారు. వెంటనే పాల సంఘం ఎన్నికలు జరపాలని వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో డైరెక్టర్లు రసాల దేవేందర్, రసాల నరేష్,మచ్చ మధు, మచ్చ ఎలేష్, ఉడుత లక్ష్మమ్మ, తో పాటుగా రైతులు డి మహేష్, ఎం నర్సింహా, బాలమ్మ లు పాల్గొన్నారు.