నవతెలంగాణ-గోదావరిఖని:
రామగుండం కార్పొరేషన్కు మరో 50 కోట్ల నిధులను మాంజూరుతో మెత్తం 100 కోట్ల నిధుల మాంజూరు చేయించడంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సఫలీకృతం అయ్యారు. గత మే నెల 8వ తేదిన రామగుండం నవ నిర్మాణ సభకు గోదావరిఖనికి విచ్చేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను రామగుండం కార్పొరేషన్కు 100 కోట్లు నిధులు కేటాయించాలని విన్నవించారు. మంత్రి రామగుండం కార్పోరేషన్ 100 కోట్ల నిధులు మాంజూరు చేస్తానని హామి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చందర్ మంత్రి కేటీఆర్ను హైదరాబాద్లో కలిసి నిధుల మాంజూరు విషయమై చర్చించారు. ఈ క్రమంలో రామగుండం అభివద్ధి పనుల కోసం రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ టీియుఎఫ్ఐసీడీ ద్వారా నిధులు మాంజూరు చేశారు.