నవతెలంగాణ – అన్నమయ్య: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- లారీ ఢీకోట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎనిమిది మంది గాయడగా.. వారిని రాజంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి కడప వెళ్తున్నది. ఈ తరుణంలో పుల్లంపేట మండలంలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సంఘటనా స్థలం క్షతగాత్రుల హాహాకారాలతో దద్దరిల్లింది.